- ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించాలని బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి సూచించారు. ఆదివారం విద్యాశాఖ పద్దుపై ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. బిహార్ లాంటి రాష్ట్రాల్లో చదువుకు 15 శాతం నిధులను బడ్జెట్లో కేటాయిస్తున్నారన్నారు. ప్రైవేటు స్కూల్స్ విచ్చలవిడిగా ఫీజులు పెంచుతున్నా.. ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
ప్రజలను బిలోపావర్టీ లెవెల్కు తీసుకెళ్తున్నామే తప్ప పేదరికం నుంచి బయటకు తీసుకురాలేకపోతున్నామన్నారు. స్కూల్ యూనిఫామ్స్ సరిగ్గా కుట్టడం లేదన్నారు. డాక్టర్లపై ఇటీవలి కాలంలో దాడులు పెరిగాయని, వాళ్లు అభద్రతా భావంలో ఉన్నారన్నారు.
