
బెజ్జంకి, వెలుగు: విద్య, వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని వడ్లూరులో రూ.8 లక్షలతో అంగన్వాడీ భవనం, తోటపల్లిలో రూ. కోటి 56 లక్షలతో పీహెచ్సీ, గాగిల్లాపూర్ టీజీ మోడల్ స్కూల్ లో రూ.13 లక్షల 50 వేలతో సైన్స్ ల్యాబ్, మండల కేంద్రంలోని కస్తూర్బా స్కూల్లో రూ.22 లక్షలతో అదనపు గదులను ప్రారంభించారు. అనంతరం ఎంపీపీ ఆఫీసులో 55 మంది లబ్ధిదారులకు రూ.17,59,400 సీఎంఆర్ చెక్కులను పంపిణీ చేశారు.
జీపీ కార్యదర్శుల సమావేశం ఏర్పాటు చేసి ఇందిరమ్మ ఇండ్ల పనులు స్పీడ్ చేసి లబ్ధిదారులకు బిల్లులు అందించాలని ఆదేశించారు. ఎంపీడీవో ప్రవీణ్, తహసీల్దార్ చంద్రశేఖర్, వైద్యాధికారి కృష్ణ తేజ, ఏఎంసీ చైర్మన్ కృష్ణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దామోదర్, మండల పార్టీ అధ్యక్షుడు రత్నాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, పోచయ్య, సంతోష్, మల్లికార్జున్, శ్రీకాంత్, చెన్నారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, డైరెక్టర్లు రాజు, సంతోష్, సాధిక్, నరసయ్య పాల్గొన్నారు.