- ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి
దుబ్బాక, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వంలో హాస్టల్స్ నిర్వహణ అధ్వానంగా ఉందని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. శనివారం దుబ్బాక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ హాస్టల్స్వార్డెన్లతో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ..విద్యార్థులకు కనీసం కాస్మొటిక్చార్జీలు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని, సరైన మెయింటనెన్స్ లేక వార్డెన్స్అనేక అవస్థలు పడాల్సి వస్తోందన్నారు. హాస్టల్ భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని వాటిని మరమ్మతు చేయడంలో ప్రభుత్వం విఫలమయిందన్నారు.
మండలానికొక్క ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తే ఎమ్మెల్యేలను శత్రువులుగా చూసే పరిస్థితి వచ్చిందన్నారు. దుబ్బాక మున్సిపాలిటీకి మంజూరైన రూ.18 కోట్ల నిధులను రద్దు చేయించారని ఆరోపించారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య, రవీందర్ రెడ్డి, యాదగిరి, రవి, కైలాస్, శ్రీనివాస్, కిషన్రెడ్డి, రాంరెడ్డి పాల్గొన్నారు.
