వర్ధన్నపేట/ కాశీబుగ్గ (కార్పొరేషన్), వెలుగు: ప్రతి ఒక్కరూ జనగణనలో పాల్గొనాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పిలుపునిచ్చారు. ఆదివారం వరంగల్జిల్లా వర్ధన్నపేట పట్టణంలోని స్వామి వివేకానంద విగ్రహం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు జనగణన అవగాహన ర్యాలీ నిర్వహించగా, ఎమ్మెల్యే, కలెక్టర్ సత్యశారద పాల్గొన్నారు. జనగణన వివరాల సేకరణ పురోగతిని హనుమకొండ కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ ఇన్చార్జి కమిషనర్ చాహత్బాజ్పాయ్ పరిశీలించారు. కాజీపేటలోని నక్కలగుట్ట, వరంగలోని కాశీబుగ్గ సర్కిల్ ఆఫీస్లను సందర్శించి హౌస్ లిస్టింగ్ ప్రక్రియ పై ఆరా తీశారు.
