
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: మహిళల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తొందని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. కొత్తగూడెంలోని కొత్తగూడెం క్లబ్లో మంగళవారం నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాలను నిర్వహించారు. మహాలక్ష్మి స్కీంలో భాగంగా ఆర్టీసీకి బస్సును పెట్టిన పాల్వంచ మహిళా సంఘానికి ఈఎంఐ కింద రూ. 69,468 చెక్కును ఆర్టీసీ చెల్లించడం పట్ల ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీకి అప్పు ఇచ్చే స్థాయికి మహిళలు ఎదిగారని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయంలో రేషన్ కార్డుల పంపిణీ జరగలేదన్నారు. ఈ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను ఇస్తొందన్నారు. ప్రోగ్రాంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ విద్యాచందనతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.