- ఎమ్మెల్యే మదన్మోహన్రావు
కామారెడ్డి, వెలుగు : యూరియా బ్లాక్ దందాకు చెక్ పెట్టాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె.మదన్మోహన్రావు పేర్కొన్నారు. మంగళవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ వానకాలం సీజన్లో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
యూరియా కొరతకు ప్రధాన కారణం బ్లాక్ మార్కెట్ చేయడమేనని పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్ రైతులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. దీనిపై మంత్రి స్పందిస్తూ యాసంగి సీజన్కు సంబంధించి యూరియా కొరత లేదని రైతులు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని తెలిపారు.
