యూరియా బ్లాక్ దందాకు చెక్ పెట్టాలి : ఎమ్మెల్యే మదన్మోహన్ రావు

యూరియా బ్లాక్ దందాకు చెక్ పెట్టాలి : ఎమ్మెల్యే  మదన్మోహన్ రావు
  •      ఎమ్మెల్యే  మదన్మోహన్​రావు

కామారెడ్డి, వెలుగు : యూరియా బ్లాక్ దందాకు చెక్​ పెట్టాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె.మదన్మోహన్​రావు పేర్కొన్నారు.  మంగళవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ వానకాలం సీజన్​లో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.  

యూరియా కొరతకు ప్రధాన కారణం బ్లాక్ మార్కెట్ చేయడమేనని పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్ రైతులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.  దీనిపై మంత్రి స్పందిస్తూ యాసంగి సీజన్​కు సంబంధించి యూరియా కొరత లేదని రైతులు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని తెలిపారు.