
కూకట్పల్లి, వెలుగు: హౌసింగ్బోర్డు స్థలాల అమ్మకాన్ని వెంటనే విరమించుకోవాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రభుత్వానికి సూచించారు. కేపీహెచ్బీ కాలనీలోని వరసిద్ధి వినాయక ఆలయం పక్కన స్థలాన్ని ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందని తెలుసుకున్న ఆయన మంగళవారం ఆ ప్రాంతాన్ని సందర్శించారు.
అనంతరం కేపీహెచ్బీ డివిజన్ కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావుతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజోపయోగమైన స్థలాలతో పాటు ఆలయ భూములను కాంగ్రెస్ వదలడం లేదన్నారు. హౌసింగ్బోర్డు స్థలాల విక్రయాన్ని నిలిపివేయకుంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు.