అథ్లెటిక్స్ పోటీల్లో సత్తా చాటాలి : ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

అథ్లెటిక్స్ పోటీల్లో సత్తా చాటాలి : ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

రామచంద్రాపురం, వెలుగు: త్వరలో జరిగే జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో మాస్టర్స్​​అథ్లెటిక్స్​అసోసియేషన్​ క్రీడాకారులు సత్తా చాటి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలపాలని ఎమ్మెల్యే, అసోసియేషన్​రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి సూచించారు. ఆదివారం భారతీనగర్​ డివిజన్​ పరిధిలో జరిగిన మాస్టర్స్​ అథ్లెటిక్స్ అసోసియేషన్ సంగారెడ్డి జిల్లా సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

ఇటీవల కరీంనగర్​లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ఓవరాల్ చాంపియన్​గా నిలిచిన జిల్లా జట్టుకు ఆయన ట్రోఫీలను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థులకు, యువతకు క్రీడలపై ఆసక్తి పెంపొందేలా మాస్టర్స్​ అథ్లెటిక్స్​ సభ్యులు పలు క్రీడల్లో పాల్గొనడం స్ఫూర్తిదాయకమన్నారు. అసోసియేషన్​ కార్యక్రమాలకు తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. 

త్వరలో జరిగే నేషనల్​ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర పేరును నిలపాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ స్టేట్​ ప్రెసిడెంట్ మర్రి లక్ష్మారెడ్డి, జిల్లా కన్వీనర్​ గురవా రెడ్డి, బీహెచ్ఈఎల్​మాజీ ఈడీ ఉదయ్​ కుమార్, ఇతర సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు.