రహదారుల ఏర్పాటుతో అభివృద్ధి వేగవంతం : ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

రహదారుల ఏర్పాటుతో అభివృద్ధి వేగవంతం : ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

రామచంద్రాపురం, వెలుగు:  కొత్త రహదారుల ఏర్పాటుతో అభివృద్ధి వేగంగా జరుగుతుందని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం తెల్లాపూర్​ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూర్​లో రూ. 2 కోట్ల వ్యయంతో నిర్మించే కొత్త రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. గ్లోసం హైట్స్ అపార్ట్​మెంట్స్ నుంచి ఔటర్​ రింగ్​ రోడ్డు వరకు కొత్త రోడ్డు ద్వారా కనెక్టివిటీ ఏర్పడనుంది. ఎమ్మెల్యే మాట్లాడుతూ తెల్లాపూర్​ మున్సిపాలిటీలో మరిన్ని కనెక్టివిటీ రోడ్లు నిర్మిస్తామన్నారు. కొత్తగా ఏర్పడిన ప్రతి కాలనీని కలుపుతూ రవాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. 

ఇప్పటికే తెల్లాపూర్​ అభివృద్ధిలో నంబర్ వన్ స్థానంలో నిలిచిందని, పార్టీలకు అతీతంగా తెల్లాపూర్​ అభివృద్ధిలో ప్రతిఒక్కరూ కలిసి రావడం గర్వించదగ్గ విషయమన్నారు.  కార్యక్రమంలో మున్సిపల్​ కమిషనర్​ అజయ్​ కుమార్​ రెడ్డి, మాజీ సర్పంచ్​ సోమిరెడ్డి, మాజీ మున్సిపల్​ వైస్ చైర్మన్​ రాములు గౌడ్​, శ్రీనివాస్​ రెడ్డి, నర్సింహా, రవీందర్ రెడ్డి, శ్రీశైలం, మల్లారెడ్డి, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.