ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ కు కరోన.. ఆయనతో మీటింగ్ లో పాల్గొన్న కేటీఆర్

ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ కు కరోన.. ఆయనతో మీటింగ్ లో పాల్గొన్న కేటీఆర్

ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ కు కరోన సోకింది. ఆయనతో పాటు ఆయన భార్య, కుటుంబ సభ్యులు, డ్రైవర్, గన్ మెన్ మొత్తం 8 మందికి కరోనా సోకినట్లు సమాచారం. వారిలో నలుగురు నిమ్స్ లో చేరారు. మరో నలుగురు హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. శనివారం తెలంగాణ భవన్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ తో జరిగిన టీఆర్ఎస్ జెనరల్ సెక్రటరీల సమావేశానికి నారదాసు హాజరయ్యారు. ఈ సమావేశానికి 18 మంది జనరల్ సెక్రటరీలు, కొంతమంది ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు మరియు నేతలు కూడా హాజరయ్యారు. ఆ తర్వాత టీఆర్ఎస్ కార్యకర్తల ఇన్సూరెన్స్ కు సంబంధించి ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులకు కేటీఆర్ చెక్ అందించిన కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఆ కార్యక్రమం సందర్భంగా నారదాసు.. మీడియా ప్రతినిధులతో కూడా మాట్లాడారు. శనివారం మీటింగ్ లో పాల్గొన్న నాయకులు ఆందోళన చెందుతున్నారు.

For More News..

శానిటైజర్ తాగి ముగ్గురు మృతి.. రహస్యంగా అంత్యక్రియలు చేసిన బంధువులు

హామిల్టన్ రికార్డు విక్టరీ.. టైర్ పంక్చర్ అయినా ఆగలేదు..

అప్పుడు కోట్లు సంపాదించిన టిక్‌‌టాక్‌ స్టార్లు.. మరి ఇప్పుడు?