
చేర్యాల, వెలుగు: జనగామ నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడు అండగా ఉంటానని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన చేర్యాల, మద్దూర్, ధూల్మిట మండలాల పరిధిలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం యూరియా సప్లై చేయడంలో విఫలమైందన్నారు.
తన ఆస్పత్రికి వచ్చే రోగులకు ఉచిత వైద్యం, అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నాన్నట్లు వివరించారు. కొమురవెల్లి మల్లన్న ఆలయాన్ని మాస్టర్ ప్లాన్లో అవకాశం కల్పించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలోజీ నారాయణరావు జయంతి వేడుకల సందర్భంగా ఆయన ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాలుగు మండలాల బీఆర్ఎస్పార్టీ నాయకులు పాల్గొన్నారు.