వర్ని, వెలుగు : సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంట్రాక్టర్కు సూచించారు. ఆదివారం వర్ని మండలం సిద్దాపూర్లోని రిజర్వాయర్ పనులను ఎమ్మెల్యే పరిశీలించి మాట్లాడారు. పనుల్లో జాప్యానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
రిజర్వాయర్ పనుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. రిజర్వాయర్ పనులు పూర్తయితే ఆయకట్టు పరిధిలోని పంటలకు పుష్కలంగా సాగునీరు అందుతుందన్నారు. కార్యక్రమంలో అగ్రోస్ చైర్మన్ కాసుల బాల్రాజ్, వర్ని ఏఎంసీ చైర్మన్ సురేశ్బాబా, జాకోరా విండో మాజీ చైర్మన్ దశరథ్, నాయకులు బారీ తదితరులు పాల్గొన్నారు.
