ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలచేస్తున్నట్లు సీఈసీ ప్రకటించింది. సీఈసీ ప్రకారం.. ఏపీలో 3, తెలంగాణలో 6 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నిక కోసం నవంబర్ 9న నోటిఫికేషన్ విడుదల కానుంది. నవంబర్ 16న నామినేషన్ల స్వీకరణ, నవంబర్ 17న నామినేషన్ల పరిశీలన, నవంబర్ 22న ఉపసంహరణ ఉండనుంది. నవంబర్ 29న పోలింగ్, కౌంటింగ్ నిర్వహించనున్నట్లు సీఈసీ తెలిపింది. ఏపీలో మే 31, తెలంగాణలో జూన్ 3న ఎమ్మెల్సీల పదవీకాలం ముగిసింది. తెలంగాణ నుంచి మహ్మద్ ఫరీదుద్దీన్, ఆకుల లలిత, నేతి విద్యాసాగర్ రావు, గుత్తా సుఖేందర్ రెడ్డి, వెంకట్వేశర్లు, కడియం శ్రీహరి పదవీకాలం ముగియడంతో.. ఆ స్థానాలు ఖాళీ అయ్యాయి.