జనం గోస పడుతుంటే మంత్రులు పట్టించుకుంటలేరు

జనం గోస పడుతుంటే మంత్రులు పట్టించుకుంటలేరు

రాష్ట్రంలో వర్షాలతో జనం అవస్థలు పడుతుంటే మంత్రులు మాత్రం ఇండ్లకే పరిమితమయ్యారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన వర్షాల వల్ల జన జీవనం పూర్తిగా స్తంభించినా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. మంత్రులు ఇప్పటికైనా వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని సూచించారు. వర్షాల కారణంగా ఇల్లు కూలిపోయిన వారికి వెంటనే డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వాలని రఘునందన్ డిమాండ్ చేశారు. 

అంతకు ముందు రాష్ట్రపతి ఎన్నికల మాక్ పోలింగ్ లో రఘునందన్ పాల్గొన్నారు. గత ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ లో 50శాతం ఓట్లు చెల్లుబాటుకాలేదన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. నూటికి నూరు శాతం ఓటింగ్ నమోదుకావాలనే ఉద్దేశంతోనే ఈ రోజు శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారి గిరిజన మహిళ రాష్ట్రపతి అయ్యే అవకాశం వచ్చిందని, రాష్ట్ర ఎమ్మెల్యేలు ద్రౌపది ముర్ముకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.