డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎంతమందికి ఇచ్చిండ్రు?: రాజాసింగ్

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎంతమందికి ఇచ్చిండ్రు?: రాజాసింగ్

హైదరాబాద్, వెలుగు:  రాష్ర్టంలో ఎంతమందికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చారో మంత్రి కేటీఆర్ చెప్పాలని ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. మొత్తం ఎన్ని ఇండ్లు కట్టారు, ఎన్ని ఇచ్చారో కేటీఆర్ దగ్గర డేటా ఉందా అని  ఆయన గురువారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. రెండో విడత ఇండ్ల పంపిణీ సందర్భంగా కేటీఆర్ వ్యాఖ్యలపై రాజాసింగ్ మండిపడ్డారు. రాష్ర్టంలో లక్ష ఇండ్లు కూడా కట్టలేదన్నారు.  డబుల్ ఇండ్ల కోసం 25 లక్షల మంది అప్లై చేసుకున్నారని, అందులో ఎంత మందికి ఇస్తారో చెప్పాలన్నారు.  

ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి ఇండ్లు కట్టలేదని కేటీఆర్ అబద్ధాలు చెబుతున్నారన్నారు. యూపీలో సింగిల్ బెడ్రూం ఇండ్లు 15.70 లక్షల ఇండ్లు, మధ్యప్రదేశ్ లో 7 లక్షల 80 వేల ఇండ్లు, మహారాష్ట్రలో 11 లక్షల 70 వేల ఇండ్లు, గుజరాత్ లో 6 లక్షల 40 వేలు, హర్యానా 2 లక్షల 65 వేల ఇండ్లు, అస్సాంలో 1 లక్ష 55 వేల ఇండ్లు కట్టించి ఇచ్చారని రాజాసింగ్ గుర్తు చేశారు.