హైదరాబాద్, వెలుగు : ధూల్ పేటలో గతంలో గుడుంబా అమ్ముకునే వాళ్లను పట్టుకొని ప్రభుత్వం పునరావాస కేంద్రాలకు పంపిందని, దీంతో ఆ కుటుంబాలకు జీవనాధారం లేకుండా పోయిందని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఆదివారం ధూల్ పేటలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ చేస్తున్నందున వాటిని గుడుంబా అమ్మకాన్ని బంద్ చేసిన వారికి ఇవ్వాలని శనివారం ప్రకటనలో కోరారు.
ఈ అంశాన్ని గతంలో కూడా అసెంబ్లీలో ప్రస్తావించానని ఆయన గుర్తు చేశారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న వాళ్లకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చేవరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టనని రాజసింగ్ పేర్కొన్నారు.