ఎమ్మెల్యే  రసమయి బూతుపురాణం

ఎమ్మెల్యే  రసమయి బూతుపురాణం

సోషల్ మీడియా పోస్టింగ్ లపై ఆగ్రహం

సిద్దిపేట, వెలుగు: సోషల్​ మీడియాలో తనకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నాడనే కారణంతో మానకొండూర్​ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ​కాంగ్రెస్​ సోషల్​ మీడియా ఇన్​చార్జిపై బూతులతో విరుచుకుపడ్డారు. ఈ ఫోన్ రికార్డింగ్​ ప్రస్తుతం సోషల్​మీడియాలో వైరల్​గా మారింది. సిద్దిపేట జిల్లా బెజ్జంకి  మండలం బేగంపేటకు చెందిన పోతిరెడ్డి రాజశేఖరరెడ్డి హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్​ కాలేజీలో లెక్చరర్​గా పనిచేస్తూ, కరీంనగర్​ పార్లమెంట్​నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్​ మీడియా ఇన్​చార్జిగా కొనసాగుతున్నారు. ఆయన మండలం, గ్రామంలోని సమస్యలపై ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్టింగులు పెడుతుంటారు.

బెజ్జంకి మండలాన్ని కరీంనగర్​లో కొనసాగించాలని, బేగంపేటను మండల కేంద్రంగా చేయాలని, ఇతరత్రా పలు సమస్యలపై ఇటీవల ఫేస్​బుక్​లో పోస్ట్​లు పెట్టారు. ఈ పోస్టింగ్​లపై ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కామెంట్స్​రావడం రసమయికి ఆగ్రహం తెప్పించింది. దీంతో శనివారం బాలకిషన్, పోతిరెడ్డి రాజశేఖరరెడ్డికి ఫోన్​చేశారు. దాదాపు మూడు నిమిషాలపాటు సాగిన ఈ సంభాషణలో రసమయి, రాజశేఖర్ రెడ్డిని ఉద్దేశించి అసభ్యకరమైన పదజాలం వాడడం వివాదాస్పదమైంది. కాగా, ఎమ్మెల్యే తీరును కరీంనగర్​ డీసీసీ అధ్యక్షుడు   కవ్వంపల్లి సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు.