వారితో మాత్ర‌మే న‌టిస్తానంటున్న రోజా

వారితో మాత్ర‌మే న‌టిస్తానంటున్న రోజా

చాలా రోజులుగా వైసీపీ ఎమ్మెల్యే, సినీ నటి రోజా కొత్త సినిమాల్లో కనిపించట్లేదు. రాజకీయాల్లో ఆమె బిజీ అయిపోయారు. అయితే, జబర్దస్త్ వంటి టీవీ కార్యక్రమాల్లో మాత్రం చురుకుగా పాల్గొంటూ ప్రేక్షకులకు దగ్గరవుతూనే ఉన్నారు. తాజాగా ఆమె ఓ కార్యక్రమంలో పాల్గొని సినిమాల్లో నటించే అంశంపై స్పందించారు.

అప్పట్లో ఆమె చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వంటి హీరోల సినిమాల్లో హీరోయిన్ ‌గా రోజా నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె హీరో లేదా హీరోయిన్ తల్లి పాత్రల్లో నటిస్తున్నారు. అయితే, ప్రస్తుతం తాను సినిమాలకు దూరంగా ఉన్నానని, చిరంజీవి, నాగార్జున సినిమాల్లో నటించే అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని ఆమె చెప్పారు.