తిరుమల శ్రీవారిని దర్శించుకున్నఎమ్మెల్యే రోజా, హీరో విశాల్

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నఎమ్మెల్యే రోజా, హీరో విశాల్

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు వైసీపీ ఎమ్మెల్యే రోజా, హీరో విశాల్. ఇవాళ ఉదయం వీఐపీ బ్రేక్ టైమ్ లో  స్వామి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వాదం అందించారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. కాలిబాటన తిరుమలకు చేరుకొని శ్రీవారిని దర్శించుకోవాలనే మొక్కు తీరిందన్నారు హీరో విశాల్. దీపావళి సందర్భంగా ఎనిమీ మూవీ రిలీజ్ అవుతుందన్నారు. కన్నడ హీరో పునీత్ మరణం బాధాకరమన్నారు. పునీత్ చదివిస్తున్న వారి బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు విశాల్.