
కౌడిపల్లి, వెలుగు : కౌడిపల్లి మండలం ముట్రాజ్ పల్లి హనుమాన్ ఆలయ వార్షికోత్సవం సందర్భంగా నాలుగు రోజుల పాటు పూజలు నిర్వహించారు. శనివారం విగ్రహాల ప్రతిష్ఠ, మంటపారాధన, హోమం, అన్నదానం కార్యక్రమాలు జరిగాయి. ఎమ్మెల్యే సునీతా రెడ్డి హాజరై పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ ఆలయాల నిర్మాణంతో మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ప్రవీణ్ కుమార్, మాజీ సర్పంచ్ సంజీవులు, వెంకటేశం, రామాగౌడ్, మైపాల్ రెడ్డి, ఎల్లం, మల్లేశ్ యాదవ్, అమర్ సింగ్ పాల్గొన్నారు.
నర్సాపూర్లో..
నర్సాపూర్: మండల పరిధిలోని గొల్లపల్లిలో రాధామల్లేశ్ గౌడ్ ఆధ్వర్యంలో శ్రీ రేణుకా మాత విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఎంపీ రఘునందన్రావు, ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. రంగంపేట ఆశ్రమ పీఠాధిపతి మాధవానంద సరస్వతి అధ్వర్యంలో పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్సుహాసిని రెడ్డి పాల్గొన్నారు.