- ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
పెబ్బేరు, వెలుగు : అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం పెబ్బేరు మున్సిపాలిటీ 11వ వార్డులోని నాగులకుంటలో అమృత్ స్కీం 2.0 ద్వారా రూ.3.14 కోట్లతో చేపట్టిన పునర్జీవ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దినదినాభివృద్ధి చెందుతున్న పెబ్బేరు పట్టణంలోని నాగులకుంట అభివృద్ధి చేస్తామన్నారు. కుంట పూర్తిగా స్వచ్ఛమైన నీటితో నిండటమే కాకుండా శోభాయమానంగా మారనుందన్నారు.
పెద్దగూడెంలో జీపీ భవనం ప్రారంభం..
వనపర్తి, వెలుగు : మండలంలోని పెద్దగూడెం తండాలో గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రారంభించారు. గ్రామాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు అహర్నిశలు పనిచేయాలని సర్పంచ్ వాల్యానాయక్కు సూచించారు. అనంతరం మండలంలోని మెంటేపల్లి గ్రామంలో నూతన అంగన్వాడీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఆయా కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
