చెన్నూరు నుండి మేడారానికి 85 స్పెషల్ బస్సులు

చెన్నూరు నుండి మేడారానికి 85  స్పెషల్ బస్సులు

మేడారం మహాజాతరకు ప్రజలు ఆర్టీసీ బస్సులను సద్వినియోగం చేసుకోవాలన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఫిబ్రవరి 18వ తేదీ ఆదివారం మంచిర్యాల జిల్లా చెన్నూరు ఆర్టీసీ బస్టాండ్ లో సమ్మక్క- సారక్క  జాతర పేరుతో..స్పెషల్ బస్సులను వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అనంతరం వివేక్ మాట్లాడుతూ.. చెన్నూర్ నుంచి మేడారం జారతకు ఆర్టీసీ బస్సులు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలందరూ ఫ్రీగా మేడారంకు వెళ్లొచ్చన్నారు. చెన్నూరు నుంచి మొత్తం 85 RTC స్పెషల్ బస్సులను నడుపుతోందన్నారు వివేక్ చెప్పారు.