హాకింపేటలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పర్యటన

హాకింపేటలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పర్యటన

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా హాకింపేటలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఆయనకు శాలువా కప్పి.. పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం అమ్మవారి గుడిలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రత్యేక పూజలు చేసి... మొక్కులు చెల్లించుకున్నారు. 

ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని.. కేసీఆర్ రాక్షస పాలను అంతమొందించాలన్న ఆకాంక్ష నెరవేరిందని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎలక్షన్ క్యాంపెనింగ్ లో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో రెండు హామీలను అమలు చేశారని.. మిగితా హామీలను కూడా అమలు చేస్తారని తెలిపారు. అందులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంపు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. రూ. 60 లక్షల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని రూ. 60 లక్షల కోట్లకు అప్పు చేసిన ఘనత కేసీఆర్ దని విమర్శించారు.