నల్గొండ: తెలంగాణ మంత్రులపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి. పనిలేక ఢిల్లీకి వచ్చారనే గోయల్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గోయల్ వ్యాఖ్యలు యావత్ తెలంగాణ ప్రజలనే అవమానించే విధంగా ఉన్నాయన్నారు. రైతాంగ సమస్య పరిష్కారానికని వస్తే అవహేళన చేస్తారా ? అని ప్రశ్నించారు. పీయూష్ గోయల్ కి వ్యవసాయంపై అవగాహన లేదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు రైతాంగ సమస్యను పార్లమెంట్ లో ప్రస్తావించలేదన్నారు.టీఆర్ఎస్ ను టార్గెట్ చేయడం తప్ప వారికి ఇంకో పని లేదన్నారు.
మరిన్ని వార్తల కోసం