కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే.. కేసీఆర్​ అవినీతిపై కమిటీ వేస్తం

కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే.. కేసీఆర్​ అవినీతిపై కమిటీ వేస్తం

రానున్న ఎన్నికల్లో విజయం సాధించి కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి రాగానే కేసీఆర్​అవినీతిపై విచారణ కమిటీ వేస్తామని ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి వ్యాఖ్యానించారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్​లో ఆయన మాట్లాడుతూ.. కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని ఆరోపించారు.  కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో డొల్లతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి సీఎం కేసీఆర్​ చూస్తున్నారని విమర్శించారు. భవిష్యత్తులో కాళేశ్వరాన్ని పర్యాటక కేంద్రంగా ఉంచనున్నట్లు చెప్పారు.

కాంగ్రెస్​ మేనిఫెస్టోలో తమ్మిడి హట్టి ప్రాజెక్ట్​ నిర్మాణాన్ని కూడా చేర్చుతామని తెలిపారు. దశాబ్ది ఉత్సవాలు అని జరుపుకుంటున్న బీఆర్​ఎస్​ సర్కార్​ దళితబంధు పథకం ఊసే ఎత్తట్లేదని విమర్శించారు.  కేసీఆర్​ సర్కార్​ అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేస్తుందన్నారు. బీఆర్​ఎస్​  ప్రజా ధనాన్ని పార్టీ ప్రచారానికి వినియోగించుకుంటోందని ఆరోపించారు.