రైతులకు ఉచిత విద్యుత్ పై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నిరసనలకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్. హైదరాబాద్ తో పాటు అన్ని జిల్లాల్లో ఆందోళనలు చేస్తున్నారు అధికార పార్టీ నేతలు. జిల్లాల్లో రేవంత్ దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తున్నారు. రేవంత్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఖబడ్ధార్ రేవంత్ అంటూ హెచ్చరిస్తున్నారు.
హైదరాబాద్ విద్యుత్ సౌధ దగ్గర ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలో ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే దానం నాగేందర్ పలువురు నేతలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ లీడర్ల ఆందోళనతో ఖైరత్ బాద్ సర్కిల్ లో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆఫీసులకు వెళ్లే సమయంలో బీఆర్ఎస్ నేతల ఆందోళనతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు.