బాక్సింగ్ ఛాంపియన్, అర్జున అవార్డు గ్రహీత నిఖత్ జరీన్ ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిశారు. ఇటీవల తాను అందుకున్న అర్జున అవార్డును, నేషనల్ విమెన్స్ బాక్సింగ్ చాంపియన్ షిప్ గోల్డ్ మెడల్ ను ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవితకు ఆమె చూపించారు. దీంతో నిఖత్ జరీన్ ను కవిత అభినందించారు. దేశ ప్రతిష్ఠను పెంచేలా క్రీడారంగంలో నిఖత్ ప్రతిభను కనబరుస్తున్నారని కొనియాడారు.
నిఖత్ భవిష్యత్తులోనూ దేశం కోసం ఇటువంటి మరెన్నో విజయాలను సాధించాలని కవిత ఆకాంక్షించారు. ‘బాక్సింగ్ ఛాంపియన్, ఇండియా గోల్డెన్ గర్ల్ నిఖత్ ను అభినందించాను. దేశం తరపున బాక్సింగ్ విభాగంలో ఆమె సాధించిన విజయాలకు మనమంతా గర్వించాలి’ అని పేర్కొంటూ కవిత ట్వీట్ చేశారు.