తెలంగాణపై కుట్రలు చేస్తే ఇక్కడే పాతరేస్తం : పల్లా రాజేశ్వర్ రెడ్డి

తెలంగాణపై కుట్రలు చేస్తే ఇక్కడే పాతరేస్తం : పల్లా రాజేశ్వర్ రెడ్డి

తెలంగాణలో మళ్ళీ ఆంధ్రానాయకులు విబేధాలు సృష్టించడానికి కుట్ర చేస్తున్నారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. 60 ఏళ్ళు తెలంగాణను దోచుకున్నారు, వాళ్ళు తిన్నది చాలదట అని ఆయన మండిపడ్డారు. 9 ఏళ్లుగా ఆంధ్రా ప్రజలు తెలంగాణలో అన్నదమ్ముల్లా కలిసి ఉన్నారు. తెలంగాణపై కుట్రలు చేస్తే ఇక్కడే పాతర వేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో కరెంట్ లేదని చెప్పిన బండి సంజయ్.. ఎక్కడైనా ఏ సమయంలోనైనా వైర్ పట్టుకొని చూడు కరెంట్ ఉందో లేదో తెలుస్తుందని అన్నారు. 

ఎన్ని చిల్లర రాజకీయాలు చేసినా తెలంగాణను ఎవరూ ఏమీ చేయలేరని పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. కొంతమంది కుక్కలు.. బొక్కలకు ఆశించి తెలంగాణపై కుట్రలకు సహకరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ జోలికి వస్తే...ఇక్కడి సమాజం ఏకమౌతుందని తెలిపారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయినా.. ఏ రాష్ట్రం నిధులు ఆ రాష్ట్రానికి చట్టబద్ధంగా దక్కేలా డిమాండ్ చేస్తామని అన్నారు. ఎన్నికలు రాగానే చంద్రబాబు లాంటి నాయకులు జెండాలు పెట్టుకొని రావడం కామన్ అని వ్యాఖ్యానించారు.