హీరోగా ఎంట్రీ ఇస్తున్న కీరవాణీ కుమారుడు

హీరోగా ఎంట్రీ ఇస్తున్న కీరవాణీ కుమారుడు

ఎమ్.ఎమ్. కీ రవాణి  పెద్ద కుమారుడు కాలభైరవ గాయకుడిగా అందరికీ పరిచయమే. ఇప్పుడు  చిన్న కుమారుడు శ్రీ సింహా కూడా‘మత్తు వదలరా’ చిత్రంతో ఎంట్రీ ఇస్తున్నాడు . సింగర్‌ గా కాదు..హీరోగా. అందరూ కొత్తవాళ్లతో రూపొందుతున్న ఈ చిత్రంతో హీరోగా శ్రీసింహా ,మ్యూజిక్ డైరెక్టర్‌ గా కాలభైరవ, డైరెక్టర్‌ గా రితేష్ రానా, సినిమాటోగ్రాఫర్‌ గా సురేష్ సారంగం, స్టంట్ కో-ఆర్డినేటర్‌ గా శంకర్, నటులుగా నరేష్ అగస్త్య, అతుల్య చంద్ర పరిచయమవుతున్నారు. సత్య, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ మూవీ ఫస్ట్‌‌లుక్‌‌ను ఎన్టీఆర్ బుధవారం తన ట్వి టర్ ద్వారా విడుదల చేశారు. ‘కాలం వేగంగా పరిగెడుతోంది. నా తమ్ముళ్లు చాలా పెద్దవాళ్లైపోయారు’ అని కామెం ట్ చేసిన తారక్.. శ్రీసింహా కి, సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్న కాలభైరవకి, చిత్ర యూనిట్‌‌కి శుభాకాం క్షలు తెలియజేశారు. ‘మత్తు వదలరా’ ఫస్ట్ లుక్‌‌ చాలా ఆసక్తికరంగా ఉంది. ఇదో మంచి సస్పె న్స్ థ్రిల్లర్‌ అని తెలుస్తోంది. ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ దశలో ఉంది. మైత్రీ మూవీ మేకర్స్, క్లా ప్ ఎంటర్‌ టైన్‌‌మెం ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నిర్మాతలలో ఒకరైన చి రంజీవి (చెర్రీ) మాట్లాడుతూ ‘ఈ చి త్రం హాస్యం తో నిండిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ . చివరి వరకు ఆసక్తికరమైన కథనంతో సా గే మంచి కథను తయారుచేశారు దర్శకుడు . కంటెంట్ అద్భు తంగా ఉంది. యంగ్ టాలెంట్‌‌ని ప్రోత్సహిం చే ఉద్దేశంతో మేమే నిర్మిస్తున్నాం.  కొత్తవారినెం దరినో పరిచయం చేస్తున్నాం. త్వరలోనే టీ జర్‌ ను విడుదల చేస్తాం’’ అని చెప్పారు.