- నోటికి కండువా చుట్టుకున్న ఫొటో పెట్టిన ప్రధాని
- మాస్క్ల వాడకంపై జనంలో అవగాహన పెంచేందుకే
న్యూఢిల్లీ: ట్విట్టర్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రొఫైల్ పిక్చర్ మారింది. లాక్ డౌన్ను మే 3 వరకూ పొడిగిస్తున్నట్టు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోడీ.. కొద్దిసేపటి తర్వాత తన ట్విట్టర్ అకౌంట్ ప్రొఫైల పిక్చర్ను మార్చారు. నోటికి, ముక్కుకు కాటన్ కండువాను చుట్టుకున్న ఫొటోలను తన బయోపిక్గా ఆయన పెట్టారు. ఈ రోజు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడానికి ముందు తీసిన ఫొటో ఇది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో మాస్క్ల అవసరంపై అవగాహన పెంచేందుకు మోడీ ప్రయత్నం చేస్తున్నారు. ఇంట్లో తయారు చేసిన మాస్క్లను మాత్రమే వాడాలని ప్రజల్లో ఎవేర్నెస్ తీసుకొచ్చే ఉద్దేశంతోనే మోడీ తన బయోపిక్ను మార్చినట్టుగా తెలుస్తోంది. డాక్టర్లు, మెడికల్ సిబ్బందికి మాత్రమే మాస్క్లు అని, సాధారణ జనాలు ఇంట్లో చేసిన మాస్క్లు, కండువాలు వాడాలని కొద్ది రోజుల క్రితం మోడీ కోరారు. శనివారం సీఎంలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో కూడా ప్రధాని ఇంట్లో తయారు చేసిన మాస్క్నే పెట్టుకున్నారు.