ఈ నెల 9న తిరుపతికి ప్రధాని మోడీ

ఈ నెల 9న తిరుపతికి ప్రధాని మోడీ

ప్రధానిగా రెండో సారి బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్రమోడీ మొదటి సారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లనున్నారు. తిరుమల శ్రీవారిని మోడీ దర్శించుకోనున్నారు. ఈ నెల 9న సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన తిరుపతి చేరుకోనున్నారు.  అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమల చేరుకుని వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోనున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ భద్రతకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు