
డిటెక్టివ్ల మాదిరిగా కనిపెట్టాలి: ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: మన బయో డైవర్సిటీ మొత్తం ప్రపంచ మానవాళికే అద్భుతమైన నిధిలాంటిదని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. తమిళ కవయిత్రి అవ్వయార్ ను ప్రస్తావిస్తూ ‘‘మనకు తెలిసింది పిడికిట్లో పట్టే ఇసుక రేణువులంత. మనకు తెలియనిది విశ్వమంత. ఇండియా బయోడైవర్సిటీ కూడా అటువంటిదే”అని చెప్పారు. ఆదివారం 62వ ఎడిషన్ మన్కీ బాత్లో ప్రధాని మాట్లాడారు. ఇటీవల మేఘాలయలో చేపల్లో అరుదైన ఓ కొత్త రకాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. గుహల్లో బతికే చేపల్లో పెద్దదని, దానికి కళ్లు కనిపించవని, చీకటిగా ఉండే అండర్గ్రౌండ్ కేవ్స్లో బతుకుతుందని వెల్లడించారు. దీని గురించి చెపుతూ.. “అత్యంత అరుదైన జీవ జాతులకు మన దేశం, ముఖ్యంగా మేఘాలయ నిలయం. ఇండియా బయోడైవర్సిటీకి మేఘాలయ కొత్త నిర్వచనాన్ని ఇచ్చింది. మన చుట్టూ అలాంటి మిస్టరీలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికీ వాటి గురించి ప్రపంచానికి తెలియదు. డిటెక్టివ్ ప్యాషన్తో వాటిని మనమే వెలికితీయాలి”అని మోడీ చెప్పారు. వలస పక్షులపై వచ్చే మూడేండ్లు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్(కోప్) కన్వెన్షన్ను మన దేశం నిర్వహించనుండటం గొప్ప గౌరవమని చెప్పారు.
ఇస్రోకు స్టూడెంట్లను తీసుకెళ్లాలె
అనుకున్న లక్ష్యాలను సాధించడానికి వయసు, వైకల్యం అడ్డంకి కాబోదని ప్రధాని మోడీ అన్నారు. కేరళకు చెందిన 105 ఏండ్ల బామ్మ లెవల్4 ఎగ్జామ్ క్లియర్ చేయడాన్ని, 12 ఏండ్ల బాలిక సౌత్ అమెరికాలోని మౌంట్ అకాన్కగువాను అధిరోహించడాన్ని, ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ దివ్యాంగుడు సొంతంగా చెప్పుల తయారీ యూనిట్ను ప్రారంభించడాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. కేరళకు చెందిన 105 ఏండ్ల బామ్మ భగీరథి అమ్మ గురించి చెపుతూ “జీవితంలో ముందుకు వెళ్లాలంటే మనల్ని మనం డెవలప్ చేసుకోవాలి. జీవితంలో ఏదైనా సాధించాలంటే.. మొట్టమొదటి కండీషన్ మనలోని స్టూడెంట్ ఎప్పటికీ చనిపోకూడదు”అని అన్నారు. చంద్రయాన్ 2 ప్రయోగ సమయంలో తాను బెంగళూరులో ఉన్నప్పుడు అక్కడికి వచ్చిన పిల్లల ఉత్సాహం చూసి తనకు ముచ్చటవేసిందన్నారు. శ్రీహరికోటలో కూర్చుని రాకెట్, శాటిలైట్లాంచింగ్ను చూసే అవకాశం ఇస్రో కల్పించిందని, ఇందుకు ఇస్రో వెబ్సైట్లో ఆన్లైన్ బుకింగ్ కూడా ఉందని చెప్పారు. వీటికి స్టూడెంట్లను తీసుకురావాలని స్కూళ్లు, పేరెంట్స్ కు మోడీ సూచించారు. వివిధ ఇస్రో సెంటర్లు, ఆస్ట్రానమీపై ఏర్పాటు చేసే వర్క్షాపుల్లో పాల్గొనే అవకాశం కల్పించే యువిక ప్రోగ్రామ్లో ఎన్రోల్ చేసుకోవాలన్నారు.
వారి కరేజ్కు నా సెల్యూట్
హునార్ హట్ దాదాపు మూడు లక్షలమంది కళాకారులకు ఉపాధి కల్పించిందన్నారు. అక్కడ కొందరు దివ్యాంగులతో తాను మాట్లాడానని, హునార్ హట్తో కనెక్ట్ అయిన తర్వాత తన జీవితం మారిపోయిందని ఓ దివ్యాంగ మహిళ చెప్పిందని మోడీ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్ గ్రామానికి చెందిన సల్మాన్ కథను కూడా మోడీ చెప్పారు. ‘‘పుట్టుకతోనే సల్మాన్ దివ్యాంగుడు. తన కాళ్లపై తాను నిలబడలేడు. తన గ్రామంలోనే చెప్పులు, డిటర్జెంట్ల తయారీ మొదలుపెట్టాడు. కొద్దిరోజుల్లోనే అతడితో మరో 30 మంది దివ్యాంగులు చేరారు. ఈ రోజు వారంతా కలసి రోజుకు 150 జతల చెప్పులు తయారు చేస్తున్నారు. అదొక్కటే కాదు.. ఈ ఏడాది మరో 100 మంది దివ్యాంగులకు ఉపాధి కల్పించాలని సల్మాన్ రిజల్యూషన్ తీసుకున్నాడు. వారి కరేజ్కు, వారి ఎంటర్ప్రైజ్కు నా సెల్యూట్”అని చెప్పారు. ఇలాంటి మరికొందరు దివ్యాంగుల గురించి కూడా మోడీ ప్రస్తావించారు.
క్రూడ్ ఆయిల్ దిగుమతులు తగ్గుతాయి
ఇండియన్ ఎయిర్ఫోర్స్ బయో జెట్ ఫ్యూయల్ను వాడటాన్ని మోడీ స్వాగతించారు. గత నెల 31న లేహ్ లోని కుషోక్ బకులా రింపోచీ ఎయిర్పోర్ట్ నుంచి ఐఏఎఫ్కు చెందిన ఏఎన్ 32 ఎయిర్ క్రాఫ్ట్ టేకాఫ్ అయ్యింది. ఇందు కోసం 10 శాతం ఇండియన్ బయో జెట్ ఫ్యూయల్ను వాడారు. రెండు ఫ్లైట్ ఇంజన్లలోనూ బయో ఫ్యూయల్ను వాడటం ఇదే తొలిసారి. బయో జెట్ ఫ్యూయల్ వాడటం వల్ల కార్బన్ ఎమిషన్స్ తగ్గడమే కాక క్రూడ్ ఆయిల్ దిగుమతుల కోసం మనం ఇతర దేశాలపై ఆధారపడే పరిస్థితి పోతుందని చెప్పారు. ఇది మేకిన్ ఇండియాకు కూడా ప్రోత్సాహాన్ని అందిస్తుందన్నారు.
ఫిట్ నేషన్.. హిట్ నేషన్
12 ఏండ్ల కామ్యా కార్తికేయన్7,000 మీటర్ల ఎత్తైన మౌంట్ అకాన్ కగువాను ఎక్కిందని, ఆమె ఫిటినెస్ లెవల్ ఎంతో అద్భుతమని మోడీ కొనియాడారు. దేశం అంతా ఫిట్గా ఉంటే.. అలాంటి దేశం ఎప్పుడు హిట్ అవుతుందని చెప్పారు. ‘‘నేను మీ అందరికీ ఒక ప్రత్యేకమైన విజ్ఞప్తిని చేస్తున్నాను. మీకు నచ్చిన చోటుకు వెళ్లండి. మీ అభిరుచికి తగ్గ పనిని ఎంచుకోండి. అలా చేస్తే మీ జీవితం ఎంతో ఆనందంగా.. అడ్వెంచరస్గా మారుతుంది”అని మోడీ చెప్పారు. ఢిల్లీలోని హునార్ హట్కు తాను వెళ్లడం గురించి కూడా మోడీ ప్రస్తావించారు. ఢిల్లీ ఎగ్జిబిషన్ ఆదివారంతో ముగుస్తుందని, కానీ రాబోయే రోజుల్లో ఇతర నగరాల్లోనూ ఇలాంటి ఎగ్జిబిషన్లు ఏర్పాటవుతాయని చెప్పారు. విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, వంటకాలు, జనం భావోద్వేగాలను తాను చూశానన్నారు. మన డైవర్సిటీ గురించి తెలుసుకోవాలంటే మీరు కూడా ఇలాంటి ఎగ్జిబిషన్లకు తప్పకుండా వెళ్లాలని సూచించారు.