సీఎంలతో భేటీ కానున్న మోడీ

సీఎంలతో భేటీ కానున్న మోడీ
  • లాక్‌డౌన్‌పై చర్చించేందుకే
  • సీఎంలతో మాట్లాడటం ఇది ఐదోసారి

న్యూఢిల్లీ: కరోనా– లాక్‌డౌన్‌ అమలు తదితర అంశాలను చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి సీఎంలతో భేటీ కానున్నారు. సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తాజా పరిస్థితులపై చర్చిస్తారని సమాచారం. మన దేశంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ప్రధాని మాట్లాడటం ఇది ఐదోసారి. కేబినెట్‌ సెక్రటరీ రాజీవ్‌ గుబా ఆదివారం ఉదయం అన్ని రాష్ట్రాల చీఫ్‌ సెక్రటరీలు, హెల్త్‌ సెక్రటరీలతో భేటీ అయ్యారు.