ఉత్తరాఖండ్ రాష్ట్రం పితోర్ఘడ్ జిల్లాలోని పార్వతీకుండ్ ఆలయాన్ని అక్టోబర్ 12వ తేదీ గురువారం సందర్శించి.. ప్రత్యేక పూజలు చేశారు ప్రధాని మోదీ. ఆ తర్వాత శివుడి ఆలయాన్ని దర్శించుకుని.. ఆశీర్వాదం తీసుకున్నారు. తర్వాత ఆది కైలాశ్ పర్వతాన్ని మోడీ సందర్శించనున్నారు.
అనంతరం జిల్లాలో రూ.4,200 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు.
Also Read : Telangana Elections : సోషల్ మీడియా యుద్ధం ప్రారంభం