పార్వతీ కుండ్ శివుడి ఆలయంలో  మోదీ ప్రత్యేక పూజలు..

పార్వతీ కుండ్ శివుడి ఆలయంలో  మోదీ ప్రత్యేక పూజలు..

ఉత్తరాఖండ్ రాష్ట్రం పితోర్ఘడ్ జిల్లాలోని పార్వతీకుండ్ ఆలయాన్ని  అక్టోబర్ 12వ తేదీ గురువారం సందర్శించి.. ప్రత్యేక పూజలు చేశారు ప్రధాని మోదీ. ఆ తర్వాత శివుడి ఆలయాన్ని దర్శించుకుని.. ఆశీర్వాదం తీసుకున్నారు. తర్వాత  ఆది కైలాశ్ పర్వతాన్ని మోడీ సందర్శించనున్నారు.

అనంతరం  జిల్లాలో రూ.4,200 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు  ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు.  ఆ తర్వాత ఏర్పాటు చేసే  భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. 

Also Read : Telangana Elections : సోషల్ మీడియా యుద్ధం ప్రారంభం