నేషనల్‌‌‌‌‌‌‌‌ ఎలైట్‌‌‌‌‌‌‌‌ మెన్స్‌‌‌‌‌‌‌‌ బాక్సింగ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో మహ్మద్‌‌‌‌‌‌‌‌ హుస్సాముద్దీన్‌‌‌‌‌‌‌‌ శుభారంభం

నేషనల్‌‌‌‌‌‌‌‌ ఎలైట్‌‌‌‌‌‌‌‌ మెన్స్‌‌‌‌‌‌‌‌ బాక్సింగ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో మహ్మద్‌‌‌‌‌‌‌‌ హుస్సాముద్దీన్‌‌‌‌‌‌‌‌ శుభారంభం

హిసార్‌‌‌‌‌‌‌‌: నేషనల్‌‌‌‌‌‌‌‌ ఎలైట్‌‌‌‌‌‌‌‌ మెన్స్‌‌‌‌‌‌‌‌ బాక్సింగ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో తెలంగాణ బాక్సర్‌‌‌‌‌‌‌‌, సర్వీసెస్‌‌‌‌‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ కంట్రోల్‌‌‌‌‌‌‌‌ బోర్డు (ఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌సీబీ)కు ఆడుతున్న మహ్మద్‌‌‌‌‌‌‌‌ హుస్సాముద్దీన్‌‌‌‌‌‌‌‌ శుభారంభం చేశారు. అతనితో పాటు గౌరవ్‌‌‌‌‌‌‌‌ సోలంకి, బిశ్వామిత్ర చాంగ్‌‌‌‌‌‌‌‌తామ్‌‌‌‌‌‌‌‌ ముందంజ వేశారు. ఆదివారం జరిగిన 57 కేజీ ఆరంభ బౌట్‌‌‌‌‌‌‌‌లో కామన్వెల్త్‌‌‌‌‌‌‌‌ గేమ్స్‌‌‌‌‌‌‌‌ డబుల్‌‌‌‌‌‌‌‌ మెడలిస్ట్‌‌‌‌‌‌‌‌ హుస్సామ్‌‌‌‌‌‌‌‌ 5–0తో బులెన్‌‌‌‌‌‌‌‌ బురగొహైన్‌‌‌‌‌‌‌‌ (అస్సాం)ను చిత్తు చేశాడు.

స్టార్టింగ్‌‌‌‌‌‌‌‌ నుంచే బౌట్‌‌‌‌‌‌‌‌లో ఫుల్‌‌‌‌‌‌‌‌ కంట్రోల్‌‌‌‌‌‌‌‌ చూపెట్టిన హుస్సామ్‌‌‌‌‌‌‌‌.. పవర్ ఫుల్​ పంచ్‌‌‌‌‌‌‌‌లతో ప్రత్యర్థిని ఎటాక్‌‌‌‌‌‌‌‌ చేశాడు. రెండో రౌండ్‌‌‌‌‌‌‌‌లో మిజోరంకు చెందిన లల్లావ్‌‌‌‌‌‌‌‌మవ్వతో పోటీ పడతాడు. ఇక, 60 కేజీ బౌట్‌‌‌‌‌‌‌‌లో హర్యానా బాక్సర్‌‌‌‌‌‌‌‌ గౌరవ్‌‌‌‌‌‌‌‌ సోలంకి 5–2తో నవ్‌‌‌‌‌‌‌‌రాజ్‌‌‌‌‌‌‌‌ చౌహాన్‌‌‌‌‌‌‌‌ (హిమాచల్‌‌‌‌‌‌‌‌)ను ఓడించాడు. హోరాహోరీగా సాగిన ఈ బౌట్‌‌‌‌‌‌‌‌ను రివ్యూ చేసిన తర్వాత సోలంకిని విన్నర్‌‌‌‌‌‌‌‌గా ప్రకటించారు. 51 కేజీ తొలి రౌండ్‌‌‌‌‌‌‌‌లో బిశ్వామిత్ర.. ఒడిశాకు చెందిన ఎన్‌‌‌‌‌‌‌‌ మధాబను ఓడించి ముందంజ వేశాడు.