Kannappa: కన్నడ ప్రజలందరూ నన్ను, నా కొడుకుని ఆశీర్వదించండి: మంచు మోహన్ బాబు

Kannappa: కన్నడ ప్రజలందరూ నన్ను, నా కొడుకుని ఆశీర్వదించండి: మంచు మోహన్ బాబు

హీరో మంచు విష్ణు టైటిల్ రోల్ పోషించిన కన్నప్ప మూవీపై అంచనాలు బాగానే ఉన్నాయి. మహాకవి ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోని భక్త కన్నప్ప చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని 'కన్నప్ప' చిత్రాన్ని రూపొందించారు.

'మహాభారత' సిరీస్ని డైరెక్ట్ చేసిన ముఖేష్ కుమార్ సింగ్ కన్నప్ప సినిమాకి దర్శకత్వం వహించాడు. జూన్ 27న తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ వరుస ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. 

ఈ సందర్భంగా నేడు (మే 31న) కన్నప్ప టీమ్ బెంగుళూరులో ప్రెస్ మీట్ నిర్వహించింది. విష్ణు మాట్లాడుతూ.. ' కన్నప్ప మూవీలో కీలక పాత్ర పోషిస్తున్న శివరాజ్ కుమార్ అన్నకు స్పెషల్ థ్యాంక్స్. తన కన్నప్ప సినిమాకు మీ పాత్ర ఎంతో కీలకంగా మారింది. ఇక తెలుగులో రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి ఆశీర్వాదం ఎప్పుడు తనతో ఉంటుంది. 1976 లో ఆయన కన్నప్ప రోల్లో నటించి ఎంతో ఆకట్టుకున్నారు. ఇప్పుడు కృష్ణంరాజు గారి లెగిసిని కంటిన్యూ చేశాననే' విశ్వాసం వ్యక్తం చేస్తున్న అని విష్ణు తెలిపారు.

►ALSO READ | Sreeleela: ఆ హీరోతో డేటింగ్ రూమర్స్.. అంతలోనే శ్రీలీల నిశ్చితార్థం అని ఫోటోలు వైరల్!

మంచు మోహన్ బాబు మాట్లాడుతూ.. "కన్నడ రాష్ట్రమన్నా, ఇక్కడి ప్రజలన్నా మాకు గుర్తొచ్చేది కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌ గారే. అటువంటి గొప్ప వ్యక్తి ఆశీస్సులు మాకు, నా బిడ్డకు కావాలి. ఆయన నటన గురించి మాట్లాడటానికి మేము సరిపోము. ఆ తర్వాత ఇక్కడ మాకు అత్యంత ఆత్మీయుడు అంబరీష్‌. అతడు చనిపోయిన తర్వాత ఇక్కడికి రావడానికి సంశయిస్తూ ఉండేవాడిని. రోజుకు ఒక్కసారైనా నేనూ అంబరీష్ మాట్లాడుకునేవాళ్లం.

జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. మనమంతా దేవుడు నడిపించే బొమ్మలం. రాత్రి పడుకుంటే ఉదయం లేస్తామో లేదో తెలియదు. సినిమా జయాపజయాలు మన చేతుల్లో లేదు. తాను తొలిసారి కన్నడలో కన్నప్ప సినిమాతో ప్రొడ్యూసర్గా లాంచ్ అవుతున్నా. ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న వెంకటేష్కు థ్యాంక్స్. కన్నడ ప్రజలందరూ నన్ను, నా కొడుకు విష్ణుని కన్నప్ప సినిమా ద్వారా ఆశీర్వదిస్తారని" మోహన్ బాబు కోరారు. 

ఈ సినిమాలో శివుడి పరమ భక్తుడు కన్నప్ప పాత్రలో విష్ణు నటించారు. హీరో ప్రభాస్ రుద్రగా, మహాశివుడిగా అక్షయ్ కుమార్, పార్వతిదేవిగా కాజల్ అగర్వాల్,  కిరాత అనే పాత్రలో మలయాళ స్టార్ మోహన్‌లాల్ నటించారు. సుమారు రూ.100కోట్లకు పైగా బడ్జెట్‍తో తెరకెక్కిన ఈ సినిమాను 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకాలపై మంచు మోహన్‍బాబు నిర్మించారు.