Neru Trailer: దృశ్యం డైరెక్టర్తో మోహన్‌‌‌‌లాల్.. ఇంట్రెస్టింగ్ డ్రామాతో ట్రైలర్ థ్రిల్

Neru Trailer: దృశ్యం డైరెక్టర్తో మోహన్‌‌‌‌లాల్.. ఇంట్రెస్టింగ్ డ్రామాతో ట్రైలర్ థ్రిల్

నలభయ్యేళ్లుగా రకరకాల పాత్రలతో ప్రేక్షకుల్ని ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్ చేస్తున్నా..ఇప్పటికీ కొత్తదనం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు మోహన్‌‌‌‌లాల్ (Mohanlal). ఎప్పటికప్పుడు ఏదో ఒక ప్రయోగానికి తెర తీస్తూనే ఉంటారాయన. ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం నెరు(Neru). ప్రముఖ దర్శకుడు జీతూ జోసెఫ్‌ (JeethuJoseph) ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 

లేటెస్ట్గా ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో విజయ్‌ మోహన్‌ అనే న్యాయవాది పాత్రలో కనిపిస్తున్నారు మోహన్ లాల్. ఇంటెన్స్ కోర్ట్ సీన్ యాక్షన్ డ్రామాతో సాగే నెరు ట్రైలర్ తో ఆడియాన్స్ లో ఆసక్తి పెంచేశారు.

'నేను విచారణకు హాజరై చాలా ఏళ్లయ్యింది. ఈ కేసుకు నేను సరిపోను’, ‘ఒక న్యాయవాదిగా విజయం, వైఫల్యాల గురించి అంచనా వేయడం సరికాదు’ అంటూ మోహన్ లాల్ చెప్పే డైలాగ్స్ సినిమాపై అంచనాలు పెంచుతుంది. ప్రియమణి (Priyamani) కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా డిసెంబరు 21న రిలీజ్ కానుంది.

మోహన్‌‌‌‌లాల్, జీతూ జోసెఫ్‌‌‌‌ కాంబినేషన్ అనగానే దృశ్యం, దృశ్యం‌‌‌‌‌‌‌‌2 సినిమాలు గుర్తొస్తాయి. మొదటిది థియేటర్స్‌‌‌‌లో బ్లాక్ బస్టర్‌‌‌‌‌‌‌‌ హిట్ సాధిస్తే, రెండోది ఓటీటీ ద్వారా విడుదలై సూపర్ సక్సెస్‌‌‌‌ను అందుకుంది. 

ప్రస్తుతం మోహన్‌‌‌‌లాల్ లూసిఫర్(Lucifer)  సినిమాకు కొన‌సాగింపుగా వస్తోన్న ‘ఎల్2ఇ: ఎంపురాన్ (L2E: Empuraan) లో నటిస్తోన్నారు. మోహ‌న్ లాల్‌, పృథ్వీరాజ్ సుకుమార‌న్ కాంబోలో రానున్న ఈ సినిమాకు సంబందించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తూ కాన్సెప్ట్ వీడియోను కూడా రిలీజ్ చేశారు.