
చైనాలోని హాంగ్జౌలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో చారిత్రాత్మకంగా 100 పతకాలను కైవసం చేసుకున్న భారత్ ప్రదర్శనను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. భారతదేశానికి అవార్డులు తెచ్చిన క్రీడాకారులను అభినందిస్తూ, క్రీడలలో వారి ప్రదర్శన విస్మయం కలిగించిందని ప్రధాని మోదీ అన్నారు.
"ఏషియన్ గేమ్స్లో భారత్కు ఇది చిరస్మరణీయ విజయం. 100 పతకాల మైలురాయిని చేరుకున్నందుకు భారత ప్రజలు సంతోషిస్తున్నారు. భారతదేశానికి ఈ చారిత్రక మైలురాయికి కారణమైన అసాధారణ అథ్లెట్లకు నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను" అని ట్వీట్ ద్వారా మోదీ తెలిపారు. అక్టోబరు 10న ఆసియా క్రీడల బృందానికి ఆతిథ్యం ఇవ్వడానికి తాను ఎదురు చూస్తున్నానని, అక్కడ అథ్లెట్లతో సంభాషిస్తానని ప్రధాని మోదీ చెప్పారు.
భారత్ కు 25 స్వర్ణాలు, 35 రజతాలు, 40 కాంస్యాలు 100 పతకాలతో చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్ నాల్గో స్థానంలో ఉండగా.. రేపటితో ఆసియా గేమ్స్ 2023 ముగియనున్నాయి.
A momentous achievement for India at the Asian Games!
— Narendra Modi (@narendramodi) October 7, 2023
The people of India are thrilled that we have reached a remarkable milestone of 100 medals.
I extend my heartfelt congratulations to our phenomenal athletes whose efforts have led to this historic milestone for India.… pic.twitter.com/CucQ41gYnA