ధర్నాలతో దద్దరిల్లిన ఆదిలాబాద్ కలెక్టరేట్

ధర్నాలతో దద్దరిల్లిన ఆదిలాబాద్ కలెక్టరేట్

ఆదిలాబాద్​టౌన్, వెలుగు: కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్​చేస్తూ కార్మిక సంఘాలు సోమవారం చేపట్టిన ధర్నాలతో ఆదిలాబాద్ కలెక్టరేట్​దద్దరిల్లింది. లెప్రసీ సర్వే నిర్వహించిన ఆశా వర్కర్ల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు జమ చేయాలని, గ్రామ పంచాయతీ కార్మికుల 6 నెలల పెండింగ్​వేతనాలు చెల్లించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

జీఓ నంబర్​60 ప్రకారం రిమ్స్​కార్మికులకు వేతనాలు చెల్లించాలని డిమాండ్​ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ను​ముట్టడించారు. తమ కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ భగత్​సింగ్​నగర్ వాసులు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్​ ముందు ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టర్​ రాజర్షి షాకు వినతి పత్రాలు అందజేశారు. ధర్నాలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆశన్న, ఆయా సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.