ఈ డబ్బెవరిది : కరీంనగర్ హోటల్లో అట్ట పెట్టెల్లో రూ.6 కోట్లు

ఈ డబ్బెవరిది : కరీంనగర్ హోటల్లో అట్ట పెట్టెల్లో రూ.6 కోట్లు

కరీంనగర్ లో అక్రమంగా తరలిస్తున్న నగదును గుర్తించారు పోలీసులు. పట్టణ కేంద్రంలోని ప్రతిమ మల్టిప్లెక్స్ హోటల్ లో లెక్కల్లోకి రాని డబ్బులు కోట్ల రుపాయలు తరలిస్తున్నారని పోలీసులకు పక్కా సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు హోటల్ పై అర్థరాత్రి నుంచి రైడ్ చేశారు. హోటల్ లో ఓ ప్రజా ప్రతినిధికి సంబంధించిన కట్ట కట్టలుగా ప్కాక్ చేసిన కోట్ల రూపాయలను గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు.  
 
ప్రతిమ మల్టిప్లెక్స్ హోటల్లో లెక్కకు రాని భారీ నగదు ఉన్నట్లు తమకు సమాచారం వచ్చిందని కరీంనగర్ ఏసీపీ నరేందర్ తెలిపారు. దీంతో తనిఖీలు చేపట్టామని చెప్పారు. రూ. 6 కోట్ల 65 లక్షల నగదు గుర్తించి సీజ్ చేసామన్నారు. ఈ నగదుకు ఎలాంటి అకౌంట్ బులిటీ లేకపోవడంతో ఈ మొత్తాన్ని కోర్టులో జమ చేస్తామని చెప్పారు. డబ్బులు ఓ రాజకీయ నాయకుడికి చెందినవిగా ప్రచారం జోరందుకుంది. ఎంపీ ఎలక్షన్స్ టార్గెట్ గా ఈ డబ్బును తరలిస్తున్నారని స్థానికులు అనుమానిస్తున్నారు.