తాగునీటి క్వాలిటీకి మరిన్ని టెస్టులు.. ఇకపై నీటి శుద్ధి కేంద్రాల వద్దే వాటర్​ అనాలసిస్​ టెస్టులు

తాగునీటి క్వాలిటీకి మరిన్ని టెస్టులు.. ఇకపై నీటి శుద్ధి కేంద్రాల వద్దే వాటర్​ అనాలసిస్​ టెస్టులు
  • థర్డ్​ పార్టీ సంస్థ ‘లూసిడ్’​కు బాధ్యతలు అప్పగింత  
  •  ఇప్పటికే మూడంచెలుగా పరీక్షిస్తున్న వాటర్​ బోర్డు
  • ఇకపై రిజర్వాయర్లు, ట్రీట్​మెంట్​ ప్లాంట్లు, బ్యాలెన్సింగ్​ రిజర్వాయర్ల  వద్ద వాటర్​ అనాలసిస్​ టెస్టులు
  • ఐఎస్​10500 ప్రమాణాలకు అనుగుణంగాఉండేలా చర్యలు


హైదరాబాద్​సిటీ, వెలుగు:  గ్రేటర్ పరిధిలో సరఫరా చేసే తాగునీటి నాణ్యతా పరీక్షలను ప్రతిరోజూ వాటర్ బోర్డు పరిధిలోని క్వాలిటీ అష్యూరెన్స్​సెల్(క్యూఏటీ సెల్​) నిర్వహిస్తూ వస్తోంది. ఇక నుంచి రిజర్వాయర్లతోపాటు ట్రీట్​మెంట్​ప్లాంట్ల వద్ద, బ్యాలెన్సింగ్​రిజర్వాయర్ల వద్ద థర్డ్​పార్టీతో క్వాలిటీ టెస్టులు చేయించాలని నిర్ణయించింది. టెండర్లు పిలిచి ఐఎస్10500: 2012 ప్రమాణాలకు అనుగుణంగా వాటర్​అనాలసిస్​టెస్టులు చేసే బాధ్యతను లూసిడ్​అనే సంస్థకు అప్పగించింది. ఈ సంస్థ సీజన్ల వారీగా మెయిన్​రిజర్వాయర్ల నీళ్లలో మార్పులను పరిశీలిస్తుంది. లూసిడ్​ఇచ్చే నివేదికల ఆధారంగా ప్రజలకు మరింత క్వాలిటీ వాటర్ అందించేందుకు వీలవుతుందని అధికారులు చెప్తున్నారు. 

రోజుకు 5 వేల శాంపిల్స్

20 ఆపరేషన్​అండ్ మెయింటెనెన్స్​డివిజన్ల ద్వారా రోజుకు 550 ఎంజీడీల నీటిని వాటర్​బోర్డు సరఫరా చేస్తోంది. డబ్ల్యూహెచ్ఓ నిబంధనలకు అనుగుణంగా వాటర్​క్వాలిటీ ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా బోర్డులోని క్వాలిటీ సెల్, ఐపీఎం, మరో స్వచ్ఛంద సంస్థ ద్వారా మూడంచెల్లో క్వాలిటీ టెస్టులు చేస్తున్నారు. రోజుకు దాదాపు 5 వేల శాంపిల్స్​తీసుకుని పరీక్షిస్తున్నారు. ఈ ప్రాసెస్​ను మరింత మెరుగుపరిచేందుకు థర్డ్​పార్టీ ద్వారా జలాశయాలు, నీటిశుద్ధి కేంద్రాల నుంచి కూడా నీటి శాంపిల్స్​సేకరించి పరీక్షలు నిర్వహించనున్నారు.

మూడు కాలాల్లోనూ పరీక్షలు  

లూసిడ్​సంస్థ గ్రేటర్​కు నీళ్లిస్తున్న నాగార్జున సాగర్, ఎల్లంపల్లి, మంజీరా, సింగూరు, హిమాయత్​సాగర్, ఉస్మాన్​సాగర్ నుంచి నీటిని సేకరించి నాణ్యత పరీక్షలు నిర్వహిస్తుంది. ఎండాకాలం, వర్షాకాలం, చలికాలంలో నీటిలో ఏర్పడే మార్పులను పరిశీలిస్తుంది. వేసవితోపాటు వర్షాకాలాల్లో రిజర్వాయర్లలోని నీళ్లలో ఆర్గనోలెప్టిక్​, ఫిజికల్​పారామీటర్స్, జనరల్​పారామీటర్స్​ద్వారా టాక్సిక్​, రేడియోయాక్టివ్​, పెస్టిసైడ్స్​రెసిడ్యుయల్​లిమిట్స్, బ్యాక్టీరియాలజికల్​క్వాలిటీ, బయోకెమికల్​ఆక్సిజన్​డిమాండ్​(వీవోడీ), కెమికల్​ఆక్సిజన్​డిమాండ్​(సీవోడీ), వైరస్​ఇండికేటర్స్​ను చెక్​చేస్తుంది. 

ఎక్కడెక్కడంటే..

నాగార్జునసాగర్​నీళ్లను కోదండపూర్​లోని ట్రీట్​మెంట్​ప్లాంట్​లోనూ, గోదావరి జలాలను మల్లారంలోని ప్లాంట్ లో​, మంజీరా వాటర్​ను రాజంపేటలో, సింగూరు నీటిని పెద్దాపూర్​లో, హిమాయత్​సాగర్, ఉస్మాన్​సాగర్​జలాలను ఆసిఫ్​నగర్​ఫిల్టర్స్​వద్ద చెక్​చేస్తారు. శుద్ధి చేయని, శుద్ధిచేసిన తర్వాత రెండు విడతల్లో శాంపిల్స్​తీసి టెస్ట్​చేస్తారు. అలాగే, ఆయా జలాశయాలకు సంబంధించి మాస్టర్​బ్యాలెన్సిగ్​రిజర్వాయర్లు, సర్వీస్​ రిజర్వాయర్ల వద్ద కూడా కొన్ని ముఖ్యమైన పాయింట్లలో నమూనాలు సేకరించి టాక్సిక్​ మెటల్స్​, ఆర్సెనిక్​, లెడ్​, క్యాడ్మమ్​, క్రామిక్​ అండ్​ మెర్క్యూరీ, కోలిఫామ్స్​అండ్​ ఈ కోలి బ్యాక్టీరియల్​టెస్ట్​లు నిర్వహిస్తారు. 

ఒక పక్క బోర్డు నిర్వహించే మూడంచెల టెస్టులతో పాటు, థర్డ్​పార్టీ నిర్వహించే టెస్టుల నివేదికను ఎప్పటికప్పుడు నేషనల్​అక్రిడేషన్​బోర్డు(ఎన్​ఏబీ)కి సమర్పిస్తారు. ఈ రిపోర్టుల ఆధారంగా మెట్రోవాటర్​బోర్డు సరఫరా చేస్తున్న తాగునీరు స్వచ్ఛమైనవనీ, ఎలాంటి కాలుష్యం లేదని చెప్తూ ఎన్​ఏబీ సర్టిఫై చేస్తుందని అధికారులు తెలిపారు.