ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న దొంగ బాబా దారుణాలు

ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న దొంగ బాబా దారుణాలు

 నిజామాబాద్ : భూతవైద్యం పేరుతో పదిహేనేళ్ల బాలికను లొంగదీసుకున్న దొంగ బాబా మూడు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ కేటుగాడిని మంగళవారం మహిళలు దేహశుద్ది చేసిన విషయం తెలిసిందే. దొంగబాబా దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కొంతకాలంగా పూసల గల్లీలో చిన్న పత్రిక నడిపిస్తూ భూత వైద్యం చేస్తున్న దొంగ బాబా..మెడిటేషన్ తో అనారోగ్య సమస్యలు తీరుస్తానని మహిళలను లొంగదీసుకుంటున్నాడు.

ఇటీవల అనారోగ్యంతో బాబాను ఆశ్రయించారు మెట్ పల్లికి చెందిన తల్లీ, కూతురు. వారికి దొంగ బాబా మాయమాటలు చెప్పి తల్లీకూతుళ్లను లోబరుచుకున్నాడు. వైద్యం పేరుతో గదిలోకి రాగానే మత్తు మందు ఇచ్చి వివస్త్రగా మార్చి లైంగికదాడి చేస్తాడు. మూడు నెలలుగా బాలికపై అత్యాచారం జరిపాడు. అయితే కడుపునొప్పి రావడంతో కూతురుని హాస్పిటల్ కి తీసుకెళ్లిన తల్లిదండ్రులకు..బాలిక మూడు నెలల గర్భవతి అని చెప్పారు డాక్టర్లు. దారుణ విషయం తెలుసుకొని మహిళా సంఘాలను ఆశ్రయించారు బాధితులు.

దీంతో మంగళవారం ఉదయం బాబా కార్యాలయానికి వచ్చి కేటుగాడిని చితకబాదారు బాధితులు, మహిళా సంఘాలు. బాధితులు తీవ్రంగా కొట్టడంతో రోడ్డుపై పరుగులు పెట్టాడు దొంగ బాబా. బాలికను వైద్య పరీక్షలకు పంపించిన పోలీసులు.. దొంగ బాబాను అరెస్ట్ చేశారు. విచారణలో ఒక్కొక్కరుగా దొంగ బాబాలు బయటికొచ్చే అవకాశం ఉందంటున్నారు పోలీసులు. ఈ సంఘటనపై విచారణ తర్వాత పూర్తి వివరాలు మీడియాకు వెల్లడిస్తామని తెలిపారు పోలీసులు.