- మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ హతం
లక్నో: ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గుఫ్రాన్ హతమయ్యాడు. గుఫ్రాన్ హత్యలు, దోపిడీలు సహా 13 కేసులలో పోలీసులకు మోస్ట్ వాంటెడ్గా ఉన్నాడు. యూపీ పోలీసులు అతడిపై ఇదివరకే రూ.1.25 లక్షల రివార్డును ప్రకటించారు. మంగళవారం తెల్లవారుజామున సమ్దా గ్రామానికి దగ్గరలో యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారని జిల్లా ఎస్పీ శ్రీవాస్తవ మీడియాకు వెల్లడించారు. ఈ క్రమంలోనే గుఫ్రాన్ను గుర్తించారని చెప్పారు. పోలీసులను చూడగానే గుఫ్రాన్ కాల్పులకు దిగడంతో వాళ్లు ఎదురు కాల్పులు జరిపారని వెల్లడించారు. ఫైరింగ్లో గుఫ్రాన్కు బులెట్ గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించామన్నారు. అక్కడ ట్రీట్మెంట్ పొందుతూ నిందితుడు చనిపోయాడని ఎస్పీ తెలిపారు.
స్పాట్ నుంచి ఒక కార్బైన్, పిస్టల్, బైక్ స్వాధీనం చేసుకున్నామన్నారు. కాగా, యూపీ పోలీసులకు, నేరగాళ్లకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లలో ఇది తాజాది. 2017లో యోగి ఆదిత్యనాథ్ సీఎం అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఉత్తర ప్రదేశ్లో 10,900కు పైగా ఎన్కౌంటర్లు జరిగాయి. అందులో 183 మంది నేరస్థులు మరణించగా.. 5,046 మంది గాయపడ్డారు. 23,300 మంది క్రిమినల్స్ అరెస్ట్ అయ్యారు.