
భద్రాచలం, వెలుగు : భద్రాచలంలోని ట్రైబల్ మ్యూజియం అద్భుతంగా ఉందని న్యూఢిల్లీలోని మినిస్టరీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ (మోట) స్పెషల్ ఆఫీసర్ సుభాష్ అన్నారు. మంగళవారం ఐటీడీఏ ప్రాంగణంలోని ట్రైబల్ మ్యూజియాన్ని ఆయన సందర్శించారు. తాతల కాలం నుంచి పాటిస్తున్న గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలు అంతరించిపోకుండా నేటి తరం గిరిజన యువతీ,యువకులు తెలుసుకుని ఆచరించి కాపాడుకునే విధంగా మ్యూజియాన్ని రూపొందించడం సంతోకరమన్నారు.
మ్యూజియంలోని కళాఖండాలు, పెయింటింగ్ చిత్రాలు చూసి ట్రైబల్ వంటకాలను ఆస్వాదించారు. గిరిజనులు వాడుకునే వస్తువులు, ఆభరణాలు చాలా బాగున్నాయని చెప్పారు. మ్యూజియంలో ప్రతీ కళాఖండం సహత్వం ఉట్టిపడేలా ఉన్నాయన్నారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో రెండు రోజుల పర్యటనలో ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలను తిలకించడంతో పాటు దేవాలయాల సందర్శన చక్కని అనుభూతిని ఇచ్చిందని తెలిపారు. అనంతరం ఐటీడీఏ పీవో తన చాంబరులో మోట స్పెషల్ ఆఫీసర్ను సత్కరించి జ్ఞాపికలను అందజేశారు.