సంకల్పం బలంగా ఉండాలి కానీ మనిషి సాధించిలేనిదంటూ ఏదీ ఉండదు. అందుకు ఉదాహరణ త్రిపురకు చెందిన షీలా రాణి దాస్. చదువుకోవాలన్న కోరిక బలంగా ఉన్నా పరిస్థితులు సహకరించలేదు. చిన్న వయస్సులోనే పెళ్లి కావడంతో అప్పుడు పదో తరగతి పరీక్షలకు హాజరు కాలేకపోయింది. ఆ తరువాత పిల్లలు పుట్టడంతో చదువును కొనసాగించలేకపోయింది. కొన్నాళ్లకు భర్త దూరం కావడంతో కుటుంబ భారం ఆమెను చదువుకు మరింత దూరం చేసింది. కానీ షీలా రాణి దాస్ కోరికను ఆమె ఇద్దరు కూతుళ్లు అర్ధం చేసుకున్నారు, తల్లి కన్న కలను నిజం చేయాలని నిర్ణయించుకుని ప్రోత్సహించారు. ఫైనల్ గా ఆమె అనుకున్నది సాధించడంతో ఆ ఇంట్లో సంబరాలు అంబరాన్ని అంటాయి.
Tripura | Shila Rani Das along with her two daughters cleared board exams in Agartala
— ANI (@ANI) July 7, 2022
We are happy as our mother passed class 10th exam and my sister and I cleared our 12th class. We motivated her and also helped in her studies: Jayashree Das, daughter of Shila Rani Das (06.07) pic.twitter.com/iS90QttBVj
త్రిపుర బోర్డ్ ఆఫ్ సెకండరీ నిర్వహించిన మెట్రిక్యులేషన్ పరీక్షల ఫలితాలు రిలీజ్ కాగా అందులో 53 ఏళ్ల షీలా రాణి ఉత్తీర్ణత సాధించారు. అదే రోజున రిలీజైన 12 వ తరగతి పరీక్షల ఫలితాల్లో అమె ఇద్దరు కూతుళ్లు రాజశ్రీ దాస్, జయశ్రీ దాస్ కూడా ఉత్తీర్ణత సాధించడం విశేషం. దీనిపై షీలా రాణి దాస్ మాట్లాడుతూ.. " నేను పరీక్షలో ఉత్తీర్ణత సాధించినందుకు సంతోషంగా ఉంది. నా ఇద్దరు కుమార్తెలు చాలా సపోర్ట్ ఇచ్చారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణీత సాధిస్తానన్న నమ్మకం నాకు ముందు నుంచి ఉంది" అని షీలా రాణి దాస్ తెలిపారు. ప్రస్తుతం ఆమె అగర్తలా మునిసిపల్ కార్పొరేషన్లో పనిచేస్తోంది.
I am happy that I've passed the exam. My daughters and other people supported me and inspired me to do it. I was confident that I will clear the exam: Shila Rani Das (06.07) pic.twitter.com/cb7aYra6tv
— ANI (@ANI) July 7, 2022