అయిదేళ్ల కింద పెళ్లి.. నాలుగేళ్ల కొడుకు.. అయినా అక్రమసంబంధాన్ని వదులుకోలేక..

అయిదేళ్ల కింద పెళ్లి.. నాలుగేళ్ల కొడుకు.. అయినా అక్రమసంబంధాన్ని వదులుకోలేక..

ఆ యువతికి అయిదేళ్ల కింద పెళ్లి అయింది. ప్రస్తుతం ఆమెకు నాలుగేళ్ల కొడుకు ఉన్నాడు. అయినా కూడా అక్రమ సంబంధాన్ని వదులుకోలేక అడ్డుగా ఉన్నాడని కన్నకొడుకునే చంపుకుందో తల్లి. ఈ దారుణ ఘటన నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని తొర్తి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన నవ్యకు తాళ్లరాంపూర్‌కు చెందిన అభిషేక్‌కి ఐదేళ్ల క్రితం పెళ్లైంది. ఈ దంపతులకు నాలుగేళ్ల నాగేంద్ర అనే కొడుకు ఉన్నాడు. అయితే నవ్యకు పెళ్లికి ముందే మరో వ్యక్తితో సంబంధముంది. పెళ్లి తర్వాత విషయం తెలియడంతో నవ్య, అభిషేక్ తరచుగా గొడవలు పడుతుండేవారు. దాంతో ఇద్దరి మధ్య దూరం పెరిగి విడివిడిగా ఉంటున్నారు. నవ్య ప్రస్తుతం కొడుకుతో కలిసి తల్లిగారింట్లో ఉంటుంది. అయితే తన సంబంధానికి కొడుకు అడ్డుగా ఉన్నాడని భావించిన నవ్య.. గురువారం రాత్రి నాగేంద్రను గొంతు నులిమి చంపేసింది. ఆ తర్వాత తనకేమీ తెలియనట్లుగా పోలీసులను నమ్మించింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. నవ్యను తమదైన శైలిలో విచారించగా తానే చంపినట్లు ఒప్పుకుంది. బాలుడి మృతదేహాన్ని అభిషేక్ కుటుంబసభ్యులు తాళ్లరాంపూర్‌కు తీసకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. అక్రమ సంబంధానికి అలవాటుపడిన నవ్య.. తన కాపురాన్ని పాడుచేసుకోవడంతో పాటు.. సొంత కొడుకుని కూడా చంపుకుందని గ్రామస్తులు అంటున్నారు.

For More News..

బాయ్‌ఫ్రెండ్ మాజీ గర్ల్‌ఫ్రెండ్ ఫొటోలను మార్ఫ్ చేసిన ప్రజెంట్ గర్ల్‌ఫ్రెండ్