చందానగర్, వెలుగు : ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు తన 10 నెలల కొడుకుతోనే కాలం గడిచిపోయేది. పిల్లవాడి స్నానం, బట్టలు మార్చడం, అన్నం తినిపించడం, డైపర్స్ మార్చడం ఇలా అందరు తల్లులు చేసే పనే తనూ చేసింది. కానీ ఈ పనులతోనే ఆమె డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. భర్త గుర్తించి పుట్టింటికి పంపించినా తిరిగివచ్చాక మళ్లీ అదే పనులతో ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్లోని చందానగర్లో జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం..ఉత్తర్ప్రదేశ్కు చెందిన అనుభవ్ చిత్రేయ్, ప్రియాంక శ్రీవాత్సవ్(30) భార్యా భర్తలు.వీరికి పది నెలల బాబు శషీల్ఉన్నాడు.
వీరు చందానగర్లోని అపర్ణ లేక్ బ్రీజ్అపార్ట్మెంట్లోని 11 వ ఫ్లోర్లో ఉంటున్నారు. అనుభవ్ డెలాయిట్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. కొద్దిరోజులుగా ప్రియాంక తన కొడుకు పెంపకం విషయంలో ఒత్తిడికి గురవుతోంది. గమనించిన భర్త నెల పాటు ప్రియాంకను పుట్టింటికి పంపించాడు. ఈ నెల 14న తిరిగి నగరానికి వచ్చింది. మళ్లీ అవే పనులు మొదలవడంతో బుధవారం 11వ అంతస్థు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుందని ఎస్ఐ శ్యాంప్రసాద్ తెలిపారు.
for more news….