హెల్త్, వెహికిల్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ పొడగింపు

హెల్త్, వెహికిల్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ పొడగింపు

న్యూఢిల్లీ : లాక్ డౌన్ కారణంగా థర్డ్ పార్టీ వెహికిల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోలేకపోయిన వారికి గుడ్ న్యూస్. ఆయా పాలసీలు రెన్యూవల్ గడువును మే 15 వరకు పొడగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇందుకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. మార్చి 25 నుంచి మే 3 వరకు పాలసీ ముగియనున్న వారంతా మే 15 వరకు కూడా రెన్యూవల్ చేసుకోవచ్చు. గ్రేస్ పిరియడ్ లో పాలసీదారుల క్లెయిమ్స్ ను పరిష్కరించాలని బీమా కంపెనీలను కేంద్రం కోరింది. గడువు పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ట్వీట్ చేయటంతో అందుకు అనుగుణంగా నోటిఫికేషన్ జారీ చేశారు. మార్చి 23 న లాక్ డౌన్ ప్రకటించిన సందర్భంగానూ ఏప్రిల్ 14 వరకు గడవు పెంచారు. లాక్ డౌన్ పొడగించిన నేపథ్యంలో మరోసారి రెన్యూవల్ గడువును పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.