నారాయణపేట, వెలుగు :నారాయణపేట పట్టణంలోని లాల్ మసీదు దర్గా రోడ్డులో శుక్రవారం ప్రమాదం చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన మాక్స్ ఖురేషీ నమాజ్ చేసేందుకు మసీదు వద్ద రోడ్డుపక్కన పార్క్ చేసి వెళ్లగా.. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయిందని స్థానికులు తెలిపారు.
తీవ్ర ఎండ వేడిమి కారణంగా ఈ ఘటన జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు. ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్న నేపథ్యంలో వాహనాలను ఎండలో ఎక్కువసేపు ఉంచకూడదని అధికారులు సూచించారు.
