మూసీ నదిలో మొసళ్ల సంచారం..భయాందోళనలో ప్రజలు

మూసీ నదిలో మొసళ్ల సంచారం..భయాందోళనలో ప్రజలు

రంగారెడ్డి జిల్లా : రాజేంద్రనగర్ ఉప్పర్ పల్లిలోని మూసీ నదిలో మొసళ్ల సంచారం స్థానికంగా కలకలం రేపింది.మూసీ నదిలో మొసళ్లు ఉన్నాయని తెలియడంతో పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మూసినది ఒడ్డున మొసళ్లు స్థానికులకు కనిపించాయి. మొసళ్లను చూసిన వారు 100కు ఫొన్ చేసి సమాచారం అందించారు. 

విషయం తెలియగానే వెంటనే మూసి నది వద్దకు రాజేంద్రనగర్ పోలీసులు, అటవీశాఖ అధికారులు చేరుకున్నారు.మొసళ్లను గమనించిన పోలీసులు, అటవీశాఖ అధికారులు స్థానికులను అలర్ట్ చేశారు. మూసిలోకి ఎవరూ దిగకూడదని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు మొసళ్లను పట్టుకోవడానికి అటవీశాఖ అధికారులు ప్రయత్నం చేశారు. కానీ, అవి అప్పటికే నీళ్లలోకి వెళ్లిపోయాయి. మూసీ వద్ద సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తామని అటవీశాఖ అధికారులు చెప్పారు.